Chittoor: పెద్దిరెడ్డి గన్మన్ సస్పెన్షన్
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:33 AM
చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మన్ కాలేషాను ఎస్పీ మణికంఠ శుక్రవారం సస్పెండ్ చేశారు.
మిథున్రెడ్డికి భోజనం, దిండు మోసుకెళ్లినట్లు అభియోగం
చిత్తూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మన్ కాలేషాను ఎస్పీ మణికంఠ శుక్రవారం సస్పెండ్ చేశారు. లిక్కర్ స్కామ్లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్రెడ్డిని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 23న ములాఖత్లో కలిశారు. పెద్దిరెడ్డి జైలు లోపలికి వెళ్లేటప్పుడు, ఆయన వెంట కాలేషా ఉన్నారు. మిథున్ రెడ్డి కోసం భోజనం బ్యాగును, తల దిండును కాలేషా మోసుకుంటూ పెద్దిరెడ్డి వెంట వెళ్తున్నట్లు వీడియోలో రికార్డయింది. ఇది వైరల్గా మారడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News