Share News

Pawan Kalyan: మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక

ABN , Publish Date - May 28 , 2025 | 05:04 AM

తెలుగుదేశం మహానాడుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలపై చర్చించే అంశాలు ప్రశంసనీయం అంటూ మహానాడు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan: మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక

చర్చకు పెట్టిన ఆరు అంశాలు ప్రశంసనీయం

ఎక్స్‌లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ‘మహానాడు అన్న పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళవారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పక్షాన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్‌, బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువగళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై చర్చించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:04 AM