అధికారులు విభేదాలు వీడాలి
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:18 AM
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత కొద్దిరోజులు అధికారుల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం ఈ విషయాన్ని టీడీపీ మండల కన్వీనర్ కొండయ్య తహసీల్దార్ వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

గాండ్లపెంట, జనవరి 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత కొద్దిరోజులు అధికారుల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం ఈ విషయాన్ని టీడీపీ మండల కన్వీనర్ కొండయ్య తహసీల్దార్ వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎండీపీఓ కార్యాలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందని, ఆ కార్యాలయంలో అధికారులు రెండు వర్గాలుగా ఉన్నట్లు చెప్పారు. వీరి మధ్య విభేదాలు వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు.