మోదీ ఓ కేడీ..: షర్మిల
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:47 AM
రాష్ట్రానికి హోదాను ఇస్తానని మోసం చేసిన ప్రధాని మోదీ ఓ కేడీ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి హోదాను ఇస్తానని మోసం చేసిన ప్రధాని మోదీ ఓ కేడీ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ఎందుకు కొట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుతిన్నాడని తెలిసీ హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆర్థికం దివాలా తీసిందంటూ హామీల అమలును వాయిదాలు వేయడాన్ని షర్మిల తప్పుపట్టారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News