Minority Welfare : మైనార్టీల ఆర్థికాభివృద్ధికి రుణాలు
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:38 AM
మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల స్వయం ఉపాధి, నైపుణ్య, ఉపాధి కల్పన కోసం రూ.326
50 శాతం సబ్సిడీతో మంజూరు : మంత్రి ఫరూక్
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల స్వయం ఉపాధి, నైపుణ్య, ఉపాధి కల్పన కోసం రూ.326 కోట్లు ఖర్చు చేసేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టిందని బుధవారం తెలిపారు. ప్రభుత్వం తరపున రూ. 152.50 కోట్లు, బ్యాంకుల ద్వారా రూ. 152.50 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా రాయితీ రుణాలను 19,790 మందికి, నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ద్వారా 29,428 మందికి మొత్తం 49,218 మందికి చేయూత ఇవ్వబోతున్నట్లు తెలిపారు.