Share News

Agricultural Technology: వ్యవసాయంలో సాంకేతికతతో సత్ఫలితాలు

ABN , Publish Date - May 28 , 2025 | 05:31 AM

మహానాడులో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ రంగానికి సాంకేతికతను అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఉద్దేశించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగునీరు, వ్యవసాయం పై ప్రభుత్వ ప్రత్యేక దృష్టిని వివరించారు.

Agricultural Technology: వ్యవసాయంలో సాంకేతికతతో సత్ఫలితాలు

వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానం చేస్తే సత్ఫలితాలు వస్తాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మహానాడులో మంత్రి లోకేశ్‌ ప్రవేశపెట్టిన ఆరు శాసనాలలో వ్యవసాయ సాంకేతికత అంశంపై అచ్చెన్నాయుడు మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.1600 కోట్లు అప్పులు చెల్లించామన్నారు. ఈ ఏడాది కాలంలో రైతులు పండించిన ప్రతి పంట, ప్రతి గింజ కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించామన్నారు. మిర్చి, పొగాకు రైతులకు మద్దతు ధరకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. హార్టికల్చర్‌ హబ్‌గా రాయలసీమ ప్రాంతాన్ని మార్చాలన్నదే లక్ష్యమన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీరు రెండూ ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశాలని, వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గోదావరి జలాలను మళ్లించి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

- మంత్రి అచ్చెన్న, దేవినేని ఉమా


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:31 AM