Atchannaidu: మార్కెటింగ్ స్థలాలను సంరక్షించాలి
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:44 AM
బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.

బదిలీలు, సిబ్బంది సమస్యలపై త్వరలో నిర్ణయం: మంత్రి అచ్చెన్న
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా, వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. మార్కెటింగ్ శాఖకు చెందిన స్థలాల వివరాలతో పాటు అధిక విలువగల స్థలాలను సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. మార్కెట్ స్థలాలను పీపీపీ విధానంలో అద్దెకివ్వడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. గుంటూరు మిర్చి యార్డులో లైసెన్సుల విధానంపై గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారుల బదిలీలు, సిబ్బంది సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా 2024-25 రబీ సీజన్లో శనగలు, కందులు, మినుములు, పెసలు, వేరుశనగ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు కోసం రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీగా ఏపీ మార్క్ఫెడ్ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News