పెమనకుంటపల్లి తండాలో మారెమ్మ విగ్రహం
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:59 PM
మండలంలోని పెమనకుంటపల్లి తండాలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్ర మాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.

నల్లమాడ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెమనకుంటపల్లి తండాలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్ర మాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో భక్తులు, టీడీపీ నాయకులు, పెమనకుంటపల్లి తండా పెద్దలు పాల్గొన్నారు.