Tirumala : శిలాతోరణం వద్ద చిరుత సంచారం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:52 AM
తిరుమల శిలాతోరణం సర్కిల్లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్ఫోన్లో వీడియో

తిరుమల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శిలాతోరణం సర్కిల్లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్ఫోన్లో వీడియో తీసుకుని టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. ఈక్రమంలో వాహనదారులను, భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు.