‘విషం కక్కుతున్న వైసీపీ మీడియా’
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:05 AM
రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ వైసీపీ మీడియా సాక్షి చానల్లో విషం కక్కుతున్నారని తెలుగు మహిళా నాయకురాలు వీరమ్మ, కవిత ఆరోపించచారరు.

పత్తికొండ, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ వైసీపీ మీడియా సాక్షి చానల్లో విషం కక్కుతున్నారని తెలుగు మహిళా నాయకురాలు వీరమ్మ, కవిత ఆరోపించచారరు. అమరావతి మహిళలపై సాక్షి డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను వారు ఖండించారు. ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణంరాజు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేట న్నారు. వీరిపై కేసు నమోదు చేయాలని పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్కు ఫిర్యాదుచేశారు.