యాగంటి హుండీ ఆదాయం రూ.29.6 లక్షలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:47 PM
జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి హుండీ ద్వారా రూ.29.60 లక్షల ఆదాయంతో పాటు 35 గ్రాముల బంగారు, 160 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, సోమవారం తెలిపారు.
బనగానపల్లె, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి హుండీ ద్వారా రూ.29.60 లక్షల ఆదాయంతో పాటు 35 గ్రాముల బంగారు, 160 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, సోమవారం తెలిపారు. 80 రోజులకు సంబంధించి ఈ ఆదాయం లభించినట్లు తెలిపారు. వెలుగోడు గ్రూపు దేవదాయశాఖ అధికారి జనార్దన్ సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. శ్రీరామ సమితి సేవకులు, భక్తులు, యాగంటిపల్లె ఉపసర్పంచ్ బండి మౌళీశ్వరరెడ్డి, భరతుడు, శ్రీరాములు, రామశేఖర్, ఆలయ, ఏపీజీబీ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.