ప్రహ్లాద వరద స్వామికి పూజలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:46 AM
అహోబిలంలో లక్ష్మీనరసిం హస్వామి అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రహ్లాద వరద స్వామి వారికి పూజలు నిర్వహించారు.
ఆళ్లగడ్డ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అహోబిలంలో లక్ష్మీనరసిం హస్వామి అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రహ్లాద వరద స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేక అలంకరించారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఉంచి ఆలయ తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహిం చారు. కార్యక్రమంలో ఛీప్ అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ రామానుజన, ఉభయ దారులు వెంకటేష్, వనజ, భక్తులు పాల్గొన్నారు.