తాగునీటి కొరత రానివ్వం
ABN , Publish Date - May 13 , 2025 | 12:41 AM
పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి రానివ్వమని మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ ముల్లా గౌస్ అన్నారు. సోమవారం పంప్ హౌస్ను సందర్శించి, పనితీరును పరిశీలిం చారు.
మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ ముల్లా గౌస్
ఆదోని టౌన్, మే 12 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి రానివ్వమని మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ ముల్లా గౌస్ అన్నారు. సోమవారం పంప్ హౌస్ను సందర్శించి, పనితీరును పరిశీలిం చారు. ఎల్లెల్సీకి తాగునీరు వచ్చేవరకు బసాపురం, రాంజల చెరువుల్లోని నీటితో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అధికారులతో చర్చించానన్నారు. పంప్ హౌస్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. పంప్హౌస్ నుంచి కొందరు తాగునీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఏమాత్రం సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. డీఈ రామమూర్తి ఏఈ జనార్దన్ పాల్గొన్నారు.