Share News

గర్భధారణల మధ్య ఎడం ఉండాలి

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:34 PM

గర్భధారణల మధ్య ఎడం అవసరమని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు.

గర్భధారణల మధ్య ఎడం ఉండాలి
పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): గర్భధారణల మధ్య ఎడం అవసరమని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబరులో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవం, బాల్య వివాహాలను నిరోధించాలనే అవగాహన పోస్ట ర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు, కౌమార గర్భాలను నివారించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.పి.శాంతికళ, జిల్లా కుష్టు, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డా.ఎల్‌. భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:34 PM