నిర్మలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:00 AM
ఇంటర్లో ప్రతిభ చూపిన నిర్మలకు అండగా ఉంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్మలను సన్మానించారు. ఉన్నత చదువకు ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు
ఆదోని రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్లో ప్రతిభ చూపిన నిర్మలకు అండగా ఉంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్మలను సన్మానించారు. ఉన్నత చదువకు ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాలికకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
నిర్మలకు నాటి కలెక్టర్ సృజన ఫోన్
ఇంటర్ ఫలితాల్లో 966 మార్కులు సాధించిన కస్తూర్బా విద్యార్థిని నిర్మలకు నాటి కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం సృజన తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల గురించి ఆమె ఆరా తీసి బుధవారం ఉదయం 6.30గంటలకు విద్యార్థినితో ఫోన్లో అభినందించారు. తరువాత ఏం చదవాలనుకున్నావు అనిడగగా, నిర్మల తాను బీఏ చదవాలనుకున్నాని తెలిపింది. వివరాలకు కనుక్కుని మంచి కాలాజీలో చేర్పిస్తానని కలెక్టర్ ఆమెకు హామీ ఇచ్చింది. అనంతరం నిర్మల మాట్లాడుతూ సృజన మేడమ్తో మాట్లాడడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది.