Share News

వినియోగదారులను మోసగిస్తే సహించం

ABN , Publish Date - May 21 , 2025 | 12:06 AM

దుకాణదారులు వినియోగదారులను మోసగిస్తే సహించ మని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ దయాకర్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ లీగల్‌ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్క రించుకుని వారం రోజులుగా వారోత్సవా లను వివిద అనుబంధ వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించారు.

వినియోగదారులను మోసగిస్తే సహించం
మాట్లాడుతున్న దయాకర్‌రెడ్డి

కర్నూలు న్యూసిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): దుకాణదారులు వినియోగదారులను మోసగిస్తే సహించ మని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ దయాకర్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ లీగల్‌ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్క రించుకుని వారం రోజులుగా వారోత్సవా లను వివిద అనుబంధ వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించారు. చివరి రోజు వంగళవారం వెంకటరమణ కాలనీలోని తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు గ్యాస్‌, పెట్రోల్‌బంకు డీలర్స్‌, కిరాణా, బంగారు దుకాణ యజమానులు, వినియోగదారులు హాజర య్యారు. ఈసందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుకాణ యజ మానులు వినియోగదారులను మోసగిస్తే చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అసిస్టెంట్‌ కంట్రోలర్‌ శ్రీరాముడు, కర్నూలు, ఆదోని ఇన్స్‌పెక్టర్లు పరమేశ్వరకుమార్‌, శ్రీనివాసులు, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు శివమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:06 AM