సంగీత కళాశాలను ఏర్పాటు చేస్తాం
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:37 AM
టీజీవీ కళాక్షేత్రంలో ప్రైవేటు సంగీత కళాశాల ఏర్పాటు చేస్తామని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు.
టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య
కర్నూలు కల్చరల్, జూన 1(ఆంధ్రజ్యోతి): టీజీవీ కళాక్షేత్రంలో ప్రైవేటు సంగీత కళాశాల ఏర్పాటు చేస్తామని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. గత నెల రోజులుగా కళాక్షేత్రంలో నిర్వహి స్తున్న బాల వెసని సాంస్కృతిక శిబిరం ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన బాలబాలికలతో సంగీత, నృత్య, చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్ర మాన్ని జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించిన పత్తి ఓబులయ్య మాట్లా డుతూ నగరంలో సంగీత శిక్షణలకు వేల రూపాయలు ఖర్చు చేసుకో వాల్సి వస్తోందని, ఈ తరుణంలో కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబోయే పైవేటు సంగీత కళాశాలలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. తద్వారా ప్రజల్లో ఆదరణ కొరవడిన మన శాస్త్రీయ సంగీతానికి పూర్వవైభవం కల్పించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంగీత, నృత్య గురువులు ఎస్ కరీముల్లా, నాగరాజు, డి. వెంకట రమణలతోపాటూ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు కె. బాలవెంకటేశ్వర్లు, శివయ్య, జీవీ శ్రీనివాసరెడ్డి, కేవీ రమణ, బీఎస్ఎన రమణ, గాండ్ల లక్ష్మన్న పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన చిన్నారుల నృత్య రూప కాలు, సంగీత కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి.