Share News

అవినీతి, అలసత్వాన్ని అరికడతాం

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:18 AM

ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని అన్నారు.

అవినీతి, అలసత్వాన్ని అరికడతాం
లోకాయుక్త కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని

రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని

కర్నూలు లీగల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోకాయుక్త కార్యాలయంలో జాతీయ జెండాను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి లోకాయుక్త కృషి చేస్తుందన్నారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి లోకాయుక్తను ఆశ్రయిస్తే విచారించి న్యాయం అందిస్తుందన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:18 AM