ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి: కమిషనర్
ABN , Publish Date - May 10 , 2025 | 12:37 AM
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు వీధి వ్యాపారులు సహకరించాలని కార్పొరేషన కమిషనర్ రవీంద్రబాబు కోరారు.

కర్నూలు న్యూసిటీ, మే 9(ఆంధ్రజ్యోతి): నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు వీధి వ్యాపారులు సహకరించాలని కార్పొరేషన కమిషనర్ రవీంద్రబాబు కోరారు. శుక్రవారం నగర పాలక కార్యాయలంలో టౌన వెండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఐడీ కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెంకటరమణ కాలనీ, సి.క్యాంపు, బిర్లా కాంపౌండ్ ప్రాంతాల్లో సుమారు 100 మంది వ్యాపారం చేసుకునే విధంగా స్మార్ట్ స్ర్టీట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 12 నుంచి వీధి వ్యాపారుల రీసర్వే ప్రారంభమవుతుందన్నారు. కార్పొరేటర్ పరమేష్, టీపీఆర్వో వెంకటలక్ష్మి, ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వరరెడ్డి సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.