హంద్రీకి నీటి విడుదల
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:41 PM
గాజుల దిన్నె ప్రాజెక్టు(జీడీపీ ) నుంచి శనివారం ఉదయం హంద్రీ నదికి నీటిని విడుదల చేశారు.
జీడీపీ నుంచి దిగువకు 3,300 క్యూసెక్కులు
గోనెగండ్ల, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గాజుల దిన్నె ప్రాజెక్టు(జీడీపీ ) నుంచి శనివారం ఉదయం హంద్రీ నదికి నీటిని విడుదల చేశారు. జీడీపీ 4, 5 గేట్లు ఎత్తి 3,300 క్యూసెక్కులు హంద్రీకి విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్ ఆలీ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జీడీపీకి వరద వచ్చి చేరుతోంది. తుంగభద్ర దిగువ కాలువ ద్వారాప్రాజెక్టులోకి 190 క్యూసెక్కుల నీటిని ఎల్లెల్సీ అఽధికారుల విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 4 టీఎంసీలు(376.70 మీటర్లు) ఉంది. జీడీపీ పూర్తిస్థాయి నీటిమట్టం 377 మీటర్లు అయితే ప్రస్తుతం కేవలం 0.30మీటర్లు మాత్ర మే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తామన్నారు. రబీ సీజన్లో ఆయకట్టుకు నీటి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో శనివారం నుంచే అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఐరన్బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, గంజహళ్లి, నెరుడుప్పల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో వరద చేరివదది. దాదాపు 150 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.