మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:45 PM
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది.
నంద్యాల టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. జురాల, సుంకేసుల జలాశయాల నుంచి 1,81,051 క్యూసెక్యుల మేర వరద శ్రీశైలం డ్యాంకు వస్తోంది. దీంతో డ్యాం అధికారులు మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 80,646 క్యూసెక్యులు శ్రీశైలం ఎడమ, కుడి గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. 6,293 క్యూసెక్కులను అదనంగా నాగార్జున సాగర్కు విడుదల చేస్తు న్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 882.40 అడుగులుగా ఉండగా నీటి నిల్వ 201.1205 టీఎంసీలుగా నమోదైంది.