Share News

జీడీపీ నుంచి హంద్రీకి నీటి విడుదల

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:38 PM

గాజులదిన్నె ప్రా జెక్టు నుంచి శనివారం మధ్యాహ్నం హంద్రీ నదికి జీడీపీ నాలుగో గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటి విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్‌ ఆలీ తెలిపారు.

జీడీపీ నుంచి హంద్రీకి నీటి విడుదల
జీడీపీ గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు

గోనెగండ్ల, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రా జెక్టు నుంచి శనివారం మధ్యాహ్నం హంద్రీ నదికి జీడీపీ నాలుగో గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటి విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్‌ ఆలీ తెలిపారు. శుక్రవారం మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ తదితర ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో ఒక మోస్తారు వర్షం కురియడంతో ఆదేరోజు రాత్రి నుంచి 500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోందన్నారు. ప్రస్తుతం గాజులదిన్నెప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రానికి నీటి మట్టం 376.80 మీటర్లు ఉందని తెలిపారు. జీడీపీ పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు అయితే ప్రస్తుతం కేవలం 0.20 మీటర్ల మాత్రమే తక్కువ ఉన్నట్లు అధికారులు వివరించారు.

Updated Date - Sep 20 , 2025 | 11:38 PM