విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:44 AM
మండలంలో విజిలెన్స్, అధికారులు దాడులు చేశారు అధికారులు సుదర్శరాజు వెంకటప్రసాద్, చెంగళరాయుడు, హొళగుంద ఏవో ఆనంద్ ఆధ్వరంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.
హొళగుంద, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో విజిలెన్స్, అధికారులు దాడులు చేశారు అధికారులు సుదర్శరాజు వెంకటప్రసాద్, చెంగళరాయుడు, హొళగుంద ఏవో ఆనంద్ ఆధ్వరంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ బిల్లు పుస్తకాలు, దాస్త్రాలు, గోదాములను తనిఖీ చేశారు. స్టాక్, ఈపీవోఎస్ మధ్య వ్యత్యాసాల కారణంగా రెండు దుకాణంలోని 26 మెట్రిక్ టన్నుల ఎరువుల మ్మకాలు నిలిపివేసినట్లు తెలిపారు. కాగా కాందరు దుకాణదారులు షాపులను మూసివేసి పరరయ్యారు.