ఉరుకుంద హుండీ రూ.1.12 కోట్లు
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:56 PM
మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరు కుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కాను కలను దేవస్థానపు కాలక్షేపపు మండపంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్ర మంను ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో విజయరాజు ఆధ్వర్యంలో చేపట్టారు.
కౌతాళం, జూలై 17(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరు కుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కాను కలను దేవస్థానపు కాలక్షేపపు మండపంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్ర మంను ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో విజయరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా భక్తులు స్వామివారికి సమర్పిం చిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.1,12,02,820, బంగారం 68 గ్రాములు, 800మిల్లి గ్రాములు, వెండి 13కిలోల 720 గ్రాములు వచ్చినట్లు తెలిపా రు. హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేష్, ఆదోని గ్రూపు ఆలయ పర్యవేక్షకులు, ఆలయ అధికారులు మల్లికార్జున, వెంక టేశ్వరరావు, దేవాలయపు ఉప ప్రధాన అర్చకులు మహదేవప్ప, అర్చకులు నాగరా జు స్వామి, శివన్నస్వామి పాల్గొన్నారు.