Share News

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.14కోట్లు

ABN , Publish Date - May 03 , 2025 | 01:15 AM

మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉ రుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలను దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శుక్రవా రం ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో లెక్కించారు.

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.14కోట్లు
హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొన్న ఆలయ సిబ్బంది

కౌతాళం, మే 2(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉ రుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలను దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శుక్రవా రం ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో లెక్కించారు. నగదు రూపంలో రూ.1,14,68,836లు, బంగారము 29 గ్రాములు, వెండి 12 కిలోలు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ రెండు నెలలకు సంబంధిం చినది. కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేష్‌, ఆదోని గ్రూపు ఆలయ పర్యవేక్షులు, ఆలయ అధికారులు మల్లికార్జున, వెంకటే శ్వరరావు, దేవాలయపు ఉప ప్రధాన అర్చకులు మహదేవప్ప, అర్చకులు నాగరాజు స్వామి, శివన్న స్వామి యూనియన బ్యాంకు సిబ్బంది, ఆలయ అర్చక సిబ్బంది, దేవస్థానపు సిబ్బందిపాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 01:15 AM