29 వరకు డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:05 AM
డ్రోన్ టెక్నాలజీపై ఈనెల 29 వరకు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ర్టార్ కె. వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు అర్బన్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): డ్రోన్ టెక్నాలజీపై ఈనెల 29 వరకు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ర్టార్ కె. వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం క్లస్టర్ యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీపై ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాన్ని ట్రిబుల్ ఐటీ డీఎం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రోన్ హబ్ త్వరలో కర్నూలులో పని చేయబోతున్నందున, విద్యార్థులను ఉద్యోగా నికి సిద్ధం చేయడానికి ఈ కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలని అన్నారు. ప్రాజెక్టు పరిశోధకుడు డాక్టర్ కె. కృష్ణనాయక్ ఈఎఫ్డీపీ సమయంలో ఐఐటీ డీఎంకే నుంచి రిసోర్స్ పర్సన్ ఫ్యాకల్టీ సభ్యులకు డ్రోన్ తయారీలో శిక్షణ ఇస్తారని, డ్రోన్ల ఎగురవేయడం కూడా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పరిశోధకుడు ఎం.నరేష్ బాబు, సమన్వయకర్త డాక్టర్ ఎ. పద్మావతి, కేవీ ఈశ్వరమూర్తి తదితరులు పాల్గొన్నారు.