ముగిసిన ‘పది’ మూల్యాంకనం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:56 PM
నంద్యాల ఎస్డీఆర్ పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 3వ తేదీన ప్రారంభమై బుధవారం ముగిసింది. డీఈవో జనార్దన్రెడ్డి మాట్లాడుతూ మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు.

నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్డీఆర్ పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 3వ తేదీన ప్రారంభమై బుధవారం ముగిసింది. డీఈవో జనార్దన్రెడ్డి మాట్లాడుతూ మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. 100 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 650 మంది సహాయ ఎగ్జామినర్లు, 200 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు హాజరై 1,78,182 జవాబు పత్రాలను మూ ల్యాంకనం చేసినట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి చేశామని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.