పాతాళానికి ఉల్లి ధర
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:21 AM
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న మొన్నటి దాకా గరిష్ఠ ధర క్వింటంపై రూ.2 వేలకు పైగానే రైతులు అందుకున్నారు.

కర్నూలు అగ్రికల్చర్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న మొన్నటి దాకా గరిష్ఠ ధర క్వింటంపై రూ.2 వేలకు పైగానే రైతులు అందుకున్నారు. శనివారం రూ.1,409కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మధ్యస్థ ధర రూ.744, కనిష్ఠ ధర రూ.585కు తగ్గిపోయింది. కందులకు పూర్తిగా ధర తగ్గింది. గత సంవత్సరం క్వింటంపై రూ.10 వేలు అందుకున్న రైతులకు ఇప్పుడు గరిష్ఠం రూ.6,799, మధ్యస్థం రూ.6,681, కనిష్ఠ ధర రూ.3 వేలు మాత్రమే దక్కింది. ఎండుమిర్చికి వివిధ రకాలకు సంబంధించి 12,809 నుంచి రూ.9,041 దక్కింది.