భక్తులతో మల్లన్న క్షేత్రం కిటకిట
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:11 AM
భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది.
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందించారు.