Share News

వైభవంగా ప్రహ్లాదరాయల రథోత్సవం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:58 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

వైభవంగా ప్రహ్లాదరాయల రథోత్సవం
చెక్క రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. బుధవారం చైత్రమాసం ద్వాదశి శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో చెక్క రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండి తుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల మంటపంలో ఊంజలసేవ నిర్వహించారు. అంతకముందు స్వామివారికి పూర్ణబోధ పూజమందిరంలో పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించి హారతులు ఇచ్చారు. పీఠాధిపతి భక్తులకు ఆశీర్వాదించారు.

Updated Date - Apr 10 , 2025 | 12:58 AM