Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:14 PM

ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి బీసీ

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

బనగాన పల్లె, నవంబరు 21 (ఆంరఽధజ్యోతి): ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలనుంచి వినతులను మంత్రి బీసీ తన క్యాంపు కార్యాలయంలో స్వీకరించారు. వివిధ గ్రామాలనుంచి వందల సంఖ్యలో ప్రజలు, బాధితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అఽధికారులు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వినతులు స్వీకరించిన మంత్రి అప్పుటికప్పుడే కొన్నింటిపై అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ పదే పదే తిప్పవద్దని అధికారులను కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - Nov 21 , 2025 | 11:14 PM