Share News

రైతుభరోసా రథాన్ని తిప్పాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:31 AM

పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుభరోసా రథాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ రథాన్ని తిప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.

రైతుభరోసా రథాన్ని తిప్పాలి
జేడీకి వినతి పత్రం ఇస్తున్న రైతుసంఘం నాయకులు

కర్నూలు అగ్రికల్చర్‌, జూన 3(ఆంధ్రజ్యోతి): పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుభరోసా రథాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ రథాన్ని తిప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని మంగళవారం జిల్లా కలెక్టరే ట్‌లో వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మిని కోరారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ ఈ బస్సు(రథం) ఉమ్మడి జిల్లాకు వచ్చి సుమారు ఏడాది కాలం గడిచిపోయిందన్నారు. లక్షలు విలువ చేసే ఈ బస్సును పక్కన పెట్టి వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:31 AM