జిల్లా కోర్టులో స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:06 AM
రాష్ట్ర హైకోర్టు ఆదేశా ల మేరకు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ కార్యాల యం ఎదుట స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కర్నూలు లీగల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ఆదేశా ల మేరకు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ కార్యాల యం ఎదుట స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ఉద్యోగులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.