విద్యార్థులను అభినందించిన సబ్ కలెక్టర్
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:27 PM
డివిజన్ పరిధిలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అభినందించారు. శనివారం కార్యాలయంలో డిప్యూటీ ఈవో వెంకట రమణ రెడ్డి, ఎంఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో 9 మంది విద్యార్థు లను అభనిందించా,రు
ప్రతిభ చూపినవారికి బహుమతులు
ఆదోని, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): డివిజన్ పరిధిలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అభినందించారు. శనివారం కార్యాలయంలో డిప్యూటీ ఈవో వెంకట రమణ రెడ్డి, ఎంఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో 9 మంది విద్యార్థు లను అభనిందించా, వారికి బహుతులను అభినందించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నా నన్నారు. నిరంతర నైపు ణ్యం, వ్యక్తిత్వ వికాసంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం పదో తరగ తిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఆరేకల్లు మహాత్మా జ్యొతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల (76మంది విద్యార్థులు) ఎమ్మిగనూరు మండలం బనవాసి ఏపీ ఆర్ఎస్ పాఠశాల 79 మంది విద్యార్థులు) ప్రిన్సిపాళ్లు జె యమునాదేవి, పీ సామ్రాజ్యాన్ని సబ్కలెక్టర్ సన్మానించారు. డిప్యూటీ డీఈవో వెంకటరమణారెడ్డి, ఎంఈవో శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.