శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు
ABN , Publish Date - May 20 , 2025 | 11:55 PM
రాఘవేంద్ర స్వామి శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతిఆచార్ తెలిపారు.
మంత్రాలయం, మే 20 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతిఆచార్ తెలిపారు. మంగళవారం 28 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. రూ. 3,79,10,455 నగదుతో పాటు 1,830 గ్రాముల వెండి, 74 గ్రాములు బంగారు, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు చెప్పారు. ఈనగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమచేసినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్ అనంతపురాణిక్, రవికులకర్ణి, కృష్ణమూర్తి, గోపి, కరణం రాఘవేంద్ర, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాదాచార్ తదితరులు పాల్గొన్నారు.