గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:00 AM
గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి సూచించారు. మంగళవారం ఆలూరు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
హౌసింగ్ పీడీ చిరంజీవి
ఆలూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి సూచించారు. మంగళవారం ఆలూరు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు వివరించి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన సాయాన్ని వివరించి, ప్రోత్సహించాల న్నారు. ఎంపీడీవో మహబూబ్ బాషా, హౌసింగ్ డీఈ ఆదినారాయణ, ఏఈ గంగమ్మ పాల్గొన్నారు.
మేలోగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
దేవనకొండ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): గతంలో మంజూరైన పీఎంఏవై గృహ నిర్మాణాలను మే చివరిలోగా పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి సూచించారు. మంగళవారం దేవనకొండ హౌసింగ్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. 2022-23లో జిల్లా వ్యాప్తంగా 11,706 పీఎంఏవై గృహాలు మంజూరు కాగా 5,874 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 5,832 గృహాలు వివిద దశలలో ఉండగా, మండలంలో 392 మంజూరు కాగా, 132 పూర్తి అయ్యాన్నారు మిగతా గృహాలను మే లోపు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. లభ్దిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకేనేలా చూడాలని డీఈ ఆదినారాయణ తెలిపారు. వర్క్ ఇన్స్పెక్టర్లు నాయుడు, నాగరాజు పాల్గొన్నారు.