Share News

మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:53 AM

మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు.

మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
పోషకాహార ప్రదర్శనను పరిశీలిస్తున్న డీఎంహెచవో

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు. మంగళవారం కల్లూరులోని 9వ అంగ నవాడీ కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పోషకాహార పక్షోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎంహెచవో మాట్లాడుతూ తల్లి, బిడ్డలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. అనంతరం సీడీపీవో అనూరాధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను డీఎంహెచవో పరిశీలించారు.

Updated Date - Apr 09 , 2025 | 12:53 AM