Share News

అర్జీలను గడువులోగా పరిష్కరించండి

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:49 AM

పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం-పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ ఆదేశించారు.

అర్జీలను గడువులోగా పరిష్కరించండి
అర్జీలను స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌

సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌

ఆదోని, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం-పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో డివిజన్‌లోని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సంబంఽధిత శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించాలని సూచించారు. సర్వేయర్‌ వేణుసూర్య, డీఎల్‌పీవో తిమ్మక్క, డీఎల్‌డీవో బాలకృష్ణారెడ్డి, ఇరిగేషన్‌ డిప్యూటీ ఇంజనీర్‌ షఫీవుల్లా, హౌసింగ్‌ ఈఈ చంద్రశేఖర్‌, ఏడీఈ బాలవర్దిరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పద్మనాభరెడ్డి, ఏవో రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:49 AM