సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:10 AM
ప్రజా పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను వేగంఆ పరిష్కరించాలని ఆదోని సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు.
సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్
ఆదోని, జూలై28(ఆంధ్రజ్యోతి): ప్రజా పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను వేగంఆ పరిష్కరించాలని ఆదోని సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టంలో మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి లబ్ధిదారులను సంతృప్తిరచాలని అధికారులకు సూచించారు. అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకూడదన్నారు. ఏవో వసుంధర, డీఎల్పీవో తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణుసూర్య, శ్రీనివాసరాజు, ఏడీఏ బాలవర్ధినిరాజు, డీటీ రుద్రగౌడ్ పాల్గొన్నారు.