ప్రజా సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:19 AM
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
బనగానపల్లె, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి బీసీ వినతులను స్వీకరించారు. అప్పుటికప్పుడే కొన్ని సమ స్యలను అధికారులకు ఫోన చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు, వ్యక్తి గత సమస్యలు మంత్రి దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు.