ఆర్డీటీ సేవలను కొనసాగించాలి
ABN , Publish Date - May 01 , 2025 | 12:40 AM
పేదల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆర్డీటీ సేవలను యథావిధిగా కొనసా గించాలని సీపీఐ కార్యదర్శి రాజాసాహెబ్, డీహెచ్పీఎస్ నాయ కుడు గురుదాస్, చేతివృత్తుల దారుల సంఘం జిల్లా కార్యదర్శి కారన్న, రైతు సంఘం కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు.
పత్తికొండ టౌన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పేదల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆర్డీటీ సేవలను యథావిధిగా కొనసా గించాలని సీపీఐ కార్యదర్శి రాజాసాహెబ్, డీహెచ్పీఎస్ నాయ కుడు గురుదాస్, చేతివృత్తుల దారుల సంఘం జిల్లా కార్యదర్శి కారన్న, రైతు సంఘం కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్డీవో ఆఫీసు ఏవో సుదర్శన్కు వినతి పత్రం సమర్పిం చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల అభ్యున్నతికి అహర్నిశలూ కృషి చేస్తుందన్నారు. ఐదున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఇవ్వకపోడంత అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు.