Share News

కస్తూర్బాలో సీట్లు ఫుల్‌

ABN , Publish Date - May 25 , 2025 | 11:56 PM

కస్తూర్భా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సీట్లు ఫుల్‌ అయ్యాయి. ప్రభుత్వం కార్పొరే ట్‌కు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తుండటంతో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు.

కస్తూర్బాలో సీట్లు ఫుల్‌
మద్దికెరలో కస్తూర్బా పాఠశాల

సీటు కోసం, పాఠశాల సిబ్బంది, నాయకుల చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణలు

మద్దికెర, మే 25 (ఆంధ్రజ్యోతి): కస్తూర్భా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సీట్లు ఫుల్‌ అయ్యాయి. ప్రభుత్వం కార్పొరే ట్‌కు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తుండటంతో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఎస్‌వో జ్యోతిరెడ్డి మాట్లాడుతూ 6వ తరగ తిలో 40 సీట్లు ఉండగా. మొదటి విడతలో 27, రెండో విడతలో 13 సీట్లను భర్తీ చేశామన్నారు. తమ పిల్లల ను చేర్పించాలని ప్రజాప్రతినిఽ దుల నుంచి ఫోన్లు చేయిస్తున్నారు.

ఆస్పరి: ఆరో తరగతిలో 40, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 40 సీట్లు భర్తీ అయ్యాయని ఎస్‌వో స్మైలీ తెలిపారు.

10 ఇంటర్మీడియట్‌ సీట్లు ఖాళీ

తుగ్గలి: కస్తూర్బా పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్లు పూర్తయ్యా యని ఎస్‌వో షాహీన్‌ తెలిపారు. అయితే ఇంటర్‌ మొదటి సంవత్సరానికి 10 సీట్లు ఖాళీగా ఉన్నాయనీ, ఆన్‌లైన్‌లోలో దరఖాస్తు చేసుకుని, సంప్రదించాలని కోరారు.

Updated Date - May 25 , 2025 | 11:56 PM