Share News

బడి తెరిచేలోపు పాఠ్యపుస్తకాలు

ABN , Publish Date - May 13 , 2025 | 12:40 AM

పాఠశాల ప్రారంభమ య్యేలోపు పాఠ్యపుస్తకాలను అందజేస్తామని ఎంఈవో-2 శ్రీనివాసులు అన్నారు. సోమవారం మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠ్యపుస్తకాల స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించారు.

బడి తెరిచేలోపు  పాఠ్యపుస్తకాలు
పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న ఎంఈవో శ్రీనివాసులు

ఆదోని అగ్రికల్చర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాల ప్రారంభమ య్యేలోపు పాఠ్యపుస్తకాలను అందజేస్తామని ఎంఈవో-2 శ్రీనివాసులు అన్నారు. సోమవారం మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠ్యపుస్తకాల స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించారు. ఆదోని నియోజక వర్గంలో 130 ప్రభుత్వ పాఠశాలలుండగా 30వేల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరి కోసం 85,070 పాఠ్యపుస్తకాలు వచ్చాయ న్నారు. ఇప్పటికే 75శాతం పుస్తకాలు వచ్చాయన్నారు. ఇంకా కన్నడ, ఉర్దూ మీడియానికి చెందిన పుస్తకాలు రావాల్సి ఉందన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:40 AM