Share News

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:14 AM

కర్ణాటక, మహారాష్ట్రలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరదజలాలు వచ్చి చేరుతుం డటంతో నదీ గర్భంలో ఉన్న సప్తనదుల సంగమేశ్వరాలం కృష్ణా నది ఒడిలోకి చేరుతోంది.

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం
కృష్ణమ్మ ఒడిలో చేరుతున్న సంగమేశ్వరాలయం

శ్రీశైలానికి కొనసాగుతున్న వరదజలాలు

కొత్తపల్లి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, మహారాష్ట్రలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరదజలాలు వచ్చి చేరుతుం డటంతో నదీ గర్భంలో ఉన్న సప్తనదుల సంగమేశ్వరాలం కృష్ణా నది ఒడిలోకి చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులకు గాను 842.40 అడుగులు కాగా, నీటి సామర్థ్యం 215 టీఎంసీల కుగాను 65.457 టీఎంసీలుగా నమోదైంది. సంగమేశ్వరాలయం జలాధివాసం అవుతున్న అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఎగువ ఉమామహేశ్వరాలయంలోని స్వామివారిని భక్తులు ఽ ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Jun 17 , 2025 | 12:14 AM