Share News

నేడు గ్రామీణ వైద్యుల సదస్సు

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:59 PM

ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి తెలిపారు.

నేడు గ్రామీణ వైద్యుల సదస్సు
గోవిందరెడ్డి

జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు గోవిందరెడ్డి

కర్నూలు హాస్పిటల్‌, జూలై 15(ఆంఽధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని ఓమిని హస్పిటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీడీ జనార్దన్‌ హాజరు అవుతారన్నారు. నగరంలోని బిర్లా కాంపౌండ్‌ పక్కన ఉన్న శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో ఈ సదస్సు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరుగుతుందని అన్నారు. మూడు వేల మంది దాకా హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:59 PM