Share News

టీడీపీ సభ్యత్వంతో రూ.10లక్షల పరిహారం

ABN , Publish Date - May 04 , 2025 | 11:42 PM

రోడ్డు ప్రమాద మృతులకు టీడీపీ సభ్యత్వం ఉం డటంతో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం మంజూరైనట్లు ఆ పార్టీ ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదివారం అన్నారు

టీడీపీ సభ్యత్వంతో రూ.10లక్షల పరిహారం
చెక్కు అందజేస్తున్న మీనాక్షినాయుడు

ఆదోని, మే 4 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద మృతులకు టీడీపీ సభ్యత్వం ఉం డటంతో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం మంజూరైనట్లు ఆ పార్టీ ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదివారం అన్నారు. నాలుగు నెలల క్రితం కుప్పగల్లు గ్రామానికి చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రని, వారిద్దరికీ టీడీపీ సభ్య త్వం ఉండటంతో పరిహా రంఇవ్వాలని రాష్ట్ర కార్యాల యం దృష్టికి తీసుకెళ్లా మన్నారు. ఇద్దరికీ సభ్యత్వం ఉండటంతో ఒక్కొక్కరికి రూ.5లక్షల ప్రకారం మొత్తం రూ.10లక్షలు ఇప్పించామన్నారు. బాధితులు, గ్రామ టీడీపీ నాయకులు మీనాక్షి నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 04 , 2025 | 11:43 PM