28న రజక ఆకాంక్ష సభ
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:02 AM
ఈనెల 28న నంద్యాలలో నిర్వహించే రజక అకాంక్ష సభను విజయవంతం చేయాలని రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి పిలుపు నిచ్చారు.
రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి
కర్నూలు అర్బన్ , డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఈనెల 28న నంద్యాలలో నిర్వహించే రజక అకాంక్ష సభను విజయవంతం చేయాలని రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి పిలుపు నిచ్చారు. గురువారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.