శ్రీశైలం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ముమ్మరం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:29 PM
శ్రీశైలం కుడి, ఎడమ గల రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ముమ్మరం చేశారు.
10 క్రస్ట్గేట్లతో కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీశైలం,సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం కుడి, ఎడమ గల రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ముమ్మరం చేశారు. జెన్-కో అధికారులు గడచిన ఇరవై నాలుగు గంటల్లో 30.754 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి గ్రిడ్కు అనుసంధానం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్గేట్లను ఒక్కొక్కటి 23 అడుగుల ఎత్తుకు తెరచి స్పిల్ వే గుండా 5,22,040 క్యూసెక్కులు దిగువ సాగర్కు విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 883 అడుగులుగా ఉండగా నీటినిల్వ సామర్ధ్యం 205 టీఎంసీలుగా ఉంది. ఎగువ జూరాల గేట్లు, సుంకేసుల, హంద్రీల నుంచి 6,00,363 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరింది. వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండటంతో జలాశయం ఇంజనీర్లు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సాగనంపుతున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 64,441 క్యూసెక్కులు విడుదల చేశారు.