సమస్యలు పరిష్కరించాలి: కమిషనర్
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:45 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను పరిశీలించి అధికా రులు జవా బుదారీతనంతో సమస్యలను పరిష్కరించాలని కార్పొ రేషన కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, జూన 16(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను పరిశీలించి అధికా రులు జవా బుదారీతనంతో సమస్యలను పరిష్కరించాలని కార్పొ రేషన కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు. సోమవారం కార్పొరేషన కార్యాలయంలో నిర్వ హించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 అర్జీలు వచ్చాయి. ఒక్కొక్క అర్జీదారుడి నుంచి సమస్యను అడిగి తెలుసు కుంటూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అఽధి కారులను ఆదేశించారు. కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లాగిన లో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్క రించాలన్నారు. అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్కుమార్, ఇనచార్జి ఎస్ఈ శేషసాయి, ఆర్ఓ జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య, శానిటేషన సూపర్వైజర్ నాగరాజు పాల్గొన్నారు.