Share News

వెండి గజవాహనంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:53 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజవాహనంపై బంగారు అంబారిలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

వెండి గజవాహనంపై ప్రహ్లాదరాయలు
వెండి గజవాహనంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజవాహనంపై బంగారు అంబారిలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం అమావాస్యను పురస్క రించుకుని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహామంగళహారతితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులను ఆశీర్వదించారు.

Updated Date - Apr 28 , 2025 | 12:53 AM